ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్-2023-25లో భారత్ కష్టాలు పెరుగుతున్నాయి.డిసెంబర్ 14 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా 3వ టెస్ట్ జరగనుంది.టెస్ట్ మ్యాచ్ జరిగే ఐదు రోజులూ బ్రిస్బేన్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయంట.ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో తలో మ్యాచ్ గెలిచి, సమంగా నిలిచాయి. అడిలైడ్లో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలుపొందగా, పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా, రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇక్కడి నుంచి దక్షిణాఫ్రికాకే ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గబ్బా టెస్టు డ్రా అయితే, ఆస్ట్రేలియాతో టీమిండియా పాయింట్లు పంచుకోవాల్సి ఉంటుంది.
పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్థానం ప్రకారం, భారత్ సొంతంగా WTC ఫైనల్కు చేరుకోవాలంటే రాబోయే మూడు మ్యాచ్లలో గెలవాలి.