రాష్ట్ర శాసనసభలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు కొత్త నిబంధనలు అమలుచేస్తున్నారు.శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు.
ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా ఉండాలనే ఇలా చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రం నుంచి నిన్నమొన్నటి వరకు శాసనసభ ఆవరణలో ఎవరైనా, ఎప్పుడైనా ఫొటోలు, వీడియోలు తీసుకునే వెసులుబాటు ఉండేది.
శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీవీ చానళ్లు లైవ్ ఇవ్వొద్దని చెప్పేవారు.ఫొటోలు, వీడియోలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
కొత్తగా ఈ సమావేశాల నుంచే నిబంధనలు తీసుకొచ్చారు.